అమృతం అమేధ్యం

మన శరీరం లోకి వెళ్లిన గాలి ఒక నిముషంలో, నీరు 4 గంటల్లో, ఆహారం 24 గంటల్లో బయటికి వెళ్లిపోవాలి లేకపోతే మనకు ఉపయోగపడిన శక్తియే మలినంగా మారి మనల్ని రోగ గ్రస్థులను చేస్తుంది. 

ఆ గత ఆహారం లాగానే గత అనుభవాలు కూడా ఉపయోగపడి కాలక్రమేణా మాలిన్యంగా మారావచ్చు. 

ఆనాడు ఉపయోగపడిన ‌వాటి ఆధారంగానే ఈ రోజు ఉన్నాము కాబట్టి వాటి పట్ల కృతజ్ఞతా భావం ఉండాలి. కానీ అవి కూడా కాలక్రమేనా మాలిన్యంగా మారతాయి అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి అనిపిస్తుంది.

మనం ప్రతిరోజూ‌ ఏ విధంగా శక్తి కొసం మళ్ళీ ఆహారాన్ని తీసుకుంటున్నామో. అలాగే గత అనుభవాల నుంచీ లభించిన ఆనందంతో ఆగకుండా మళ్ళీ నూతనంగా ఆ ఆనందం పొందే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఆ గత ఆనందమే కాలక్రమేణా మాలిన్యంగా మారవచ్చు. 

మనలో చేరి బయటికి వెళ్లిపోకుండా తిష్ట వేసుకొని ఉన్న గతం మృతప్రాయం. ఉన్నవాటిని మెల్లిమెల్లిగా తొలగించే ప్రయత్నం చేయాలి. ప్రతి రోజూ ధ్యానం, పరివర్తన పూరిత ఆలోచనలు ద్వారా ఆ మానసిక మాలిన్యాలను శుద్ధి చేసి. మళ్లీ వాటిని పునర్నిర్మించే ప్రయత్నం చేయాలనిపిస్తుంది. అప్పుడు మనం జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉంటాము. 

పరమాత్మ మనకు శుద్ధిని చేసుకునే శక్తిని ప్రసాదించాలి.



Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao