Atal Bihari Vajpayee (Telugu 25.12.2025)
⚛️🪷🌳
ప్రతిపక్షంలో ఉన్న వాజపేయిపై అధికార పక్షంలో ఉన్న అప్పటి ప్రధానమంత్రుల ఆలోచనలు అనగా నెహ్రూ ఆశ, రాజీవ్ గాంధీ ఉపకారం, నరసింహారావు గారి నమ్మకం, అన్నింటికీ ప్రతిరూపంగా నిలిచిన ప్రతిపక్ష ప్రముఖుడు వాజపేయి
నెహ్రూ దృష్టి:
1957లో అటల్ బిహారీ వాజపేయి గారు మొదటిసారి లోకసభకు ఎన్నికయ్యారు. అప్పట్లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండేవారు. వాజపేయి గారు హిందీలో మాట్లాడే అనర్గళమైన ప్రసంగాలు, విదేశీ విధానాలపై ఆయనకున్న పట్టు చూసి నెహ్రూ ముగ్ధులయ్యేవారు. ఒకసారి విదేశీ ప్రతినిధులు భారతదేశానికి వచ్చినప్పుడు, నెహ్రూ గారు వాజపేయిని పరిచయం చేస్తూ.. "ఈ యువకుడు భవిష్యత్తులో ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు" అని చెప్పారు.
రాజీవ్ గాంధీ మానవీయత:
మరో సంఘటన 1988లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి భారత ప్రతినిధి బృందంలో అటల్ బిహారీ వాజపేయిని చేర్చారు. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో పెద్దలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు, కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయిని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.
ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా,1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. వైద్యులు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు, ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు.
ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా వెళ్లాలని ఫోనులో కోరారు, కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ "అటల్ జీ, ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో భారత దేశానికి రండి "..అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే, నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే "..అని వాజపేయి చెప్పారు.
నరసింహారావు దేశహిత దృష్టి:
మరో సంఘటన 1994లో పీవీ నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ఒత్తిడి పెంచిన సందర్భంలో, జెనీవాలో జరిగే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమావేశంలో కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ భారత దేశాన్ని ఇరకాటంలో పెట్టాలని చూసింది. అప్పుడు ప్రధాని పీవీ నరసింహారావు గారు (కాంగ్రెస్), భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాల్సిందిగా ప్రతిపక్ష నేత వాజపేయిని కోరారు. దేశం కోసం పార్టీ విభేదాలను పక్కన పెట్టి వాజపేయి అక్కడికి వెళ్లి, భారతదేశ వాణిని బలంగా వినిపించి విజయం సాధించారు."దేశం వెలుపల మనం భారతీయులం మాత్రమే, రాజకీయ నాయకులం కాదు" అనే సందేశాన్ని ఈ ఘటన చాటిచెప్పింది.
సంపాదకత్వం
💭⚖️🙂📝@🌳
📖25.12.2025✍️

మూలం:
ReplyDeleteరాజకీయాలలో విలువలు, ఉదారత్వం !
"సార్.. ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు, మీతో మాట్లాడుతారుట " ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి" (అప్పటిలో లోక్ సభలో బీజేపీకి రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి)
ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రితో రెండు నిమిషాలు మాట్లాడారు.
ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి
"మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం, ఏర్పాట్లు చూడండి " అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశ్చర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి నిర్ధారణ చేసుకున్నాడు కార్యదర్శి"
"సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా ? అని ఆడిగాడు కార్యదర్శి "
వాజపేయి ఒక్క క్షణం అతని వంక చూసి నవ్వుతూ
" నిక్షేపంగా " అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ.. అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది.
రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు, సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి హాజరవుతూ ప్రతిపక్ష పార్టీ నేతను వెంట పెట్టుకెళ్లటం ఏంటి ? అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు, కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయిని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.
ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా,1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. వైద్యులు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు, ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు.
ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా వెళ్లాలని ఫోన్ లో కోరారు, కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ
"అటల్ జీ, ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియాకి రండి "..అని చెప్పారు.
ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే, నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే "..
పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు ..!
👌
ReplyDeleteచాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను దీనివల్ల, చాలా బాగుంది
ReplyDelete👌👌👏👏
ReplyDelete